ఛాందోగ్యం తృతీయ ప్రపాఠకంలో ఈ విధంగా ఉన్నది.
"యజ్ఞరూపుడైన పురుషుడు గడిపిన 24 సంవత్సరాలు ప్రాతఃకాల యజ్ఞం. అందుకని గాయత్రి ఛందస్సు 24 అక్షరాలు.
ఆ పురుషుడు తరవాత గడిపిన 44 సంవత్సరాలు
మాధ్యాహ్నిక సవనం. అందుకే త్రిష్టుప్ ఛందస్సు 44 అక్షరాలు.
యజ్ఞపురుషుడు తరవాత గడిపిన 48 సంవత్సరాలు
మూడోసవనం. అందుకే జగతీ ఛందస్సులో 48 అక్షరాలు ఉంటాయి.
ఈ యజ్ఞ సిద్ధాంతాన్ని తెలుసుకున్న వారు 116 (24+44+48) సంవత్సరాలు బ్రతుకుతారు."
ఎవరైతే ఈ సిద్ధాంతం తెలిసి ఉంటారో, ఆ మూడు వైదిక ఛందస్సులు అధ్యయనం చేసి ఉంటారో, వారిని గౌరవిస్తూ నూటపదహారులు దక్షిణ ఇవ్వటం మొదలై ఉంటుంది అనుకోవటం ఎంతో సుందరంగానూ, సుసంగతంగానూ, ఉపనిషత్సమ్మతంగానూ అనిపిస్తోంది.
ఈ మధ్య ఎక్కడో విన్న మాట, నిజాం రాజ్య
రూపాయికీ బ్రిటిష్ రూపాయికీ మారకంలో ఉన్న తేడా వల్ల నూట పదహార్లువాడుకలోకి
వచ్చింది అనేది ఆలోచించాల్సిన మాటే అని అనిపిస్తోంది.
- జొన్నలగడ్డ సౌదామిని.
No comments:
Post a Comment