Friday 18 February 2022

నూట పదహార్లు

ఛాందోగ్యం తృతీయ ప్రపాఠకంలో ఈ విధంగా ఉన్నది.

"యజ్ఞరూపుడైన పురుషుడు గడిపిన 24 సంవత్సరాలు ప్రాతఃకాల యజ్ఞం. అందుకని గాయత్రి ఛందస్సు 24 అక్షరాలు.

ఆ పురుషుడు తరవాత గడిపిన 44 సంవత్సరాలు మాధ్యాహ్నిక సవనం. అందుకే త్రిష్టుప్ ఛందస్సు 44 అక్షరాలు.

యజ్ఞపురుషుడు తరవాత గడిపిన 48 సంవత్సరాలు మూడోసవనం. అందుకే జగతీ ఛందస్సులో 48 అక్షరాలు ఉంటాయి.

ఈ యజ్ఞ సిద్ధాంతాన్ని తెలుసుకున్న వారు 116 (24+44+48) సంవత్సరాలు బ్రతుకుతారు."

ఎవరైతే ఈ సిద్ధాంతం తెలిసి ఉంటారో, ఆ మూడు వైదిక ఛందస్సులు అధ్యయనం చేసి ఉంటారో, వారిని గౌరవిస్తూ నూటపదహారులు దక్షిణ ఇవ్వటం మొదలై ఉంటుంది అనుకోవటం ఎంతో సుందరంగానూ, సుసంగతంగానూ, ఉపనిషత్సమ్మతంగానూ అనిపిస్తోంది.

ఈ మధ్య ఎక్కడో విన్న మాట, నిజాం రాజ్య రూపాయికీ బ్రిటిష్ రూపాయికీ మారకంలో ఉన్న తేడా వల్ల నూట పదహార్లువాడుకలోకి వచ్చింది అనేది ఆలోచించాల్సిన మాటే అని అనిపిస్తోంది.


                                                                                - జొన్నలగడ్డ సౌదామిని.

No comments:

Post a Comment

పేరు మార్పు

అబ్బ, ఆగవయ్యా, ఒకటే తొందర పెడుతున్నావు. కాసేపు మమ్మల్ని మా అమ్మతో ముచ్చట్లు చెప్పుకోనీ?..  ఎంత సేపూ నీ గొడవేనా?. ఏమిటీ, పెళ్ళి ముహూర్తం దగ్గ...